Friday, January 16, 2026
HomeతెలంగాణRythu Bharosa : సంక్రాంతి శుభవార్త.. రైతు భరోసా సాయం రబీ సీజన్‌కు..!

Rythu Bharosa : సంక్రాంతి శుభవార్త.. రైతు భరోసా సాయం రబీ సీజన్‌కు..!

Rythu Bharosa : తెలంగాణ రైతులకు శుభవార్త! రైతు భరోసా పథకం కొనసాగుతూనే ఉంది. ప్రభుత్వం రబీ సీజన్‌కు సంక్రాంతి పండుగ సందర్భంగా ఎకరాకు రూ.6 వేల ఆర్థిక సాయాన్ని అర్హులైన రైతుల ఖాతాల్లో జమ చేయనుంది. సోషల్ మీడియాలో వ్యాప్తి చెందుతున్న పథకాన్ని ఆపేస్తున్నారనే అసత్య ప్రచారాలను నమ్మవద్దని తెలంగాణ ఫ్యాక్ట్ చెక్ హెచ్చరిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా 65 లక్షల మంది రైతులకు ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరుతుందని స్పష్టం చేసింది.

అర్హులైన లబ్ధిదారులను ఖచ్చితంగా గుర్తించేందుకు ప్రభుత్వం శాటిలైట్ మ్యాపింగ్ ప్రక్రియను చేపట్టింది. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం జర్మన్ టెక్నాలజీ సాయంతో వ్యవసాయేతర, వాణిజ్య భూములను (సుమారు 4 లక్షల ఎకరాలు) గుర్తించి జాబితా నుంచి తొలగిస్తోంది. ఈ ప్రక్రియ వేగవంతం చేయాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. మ్యాపింగ్ పూర్తయిన తర్వాతే సాయం పంపిణీ జరుగుతుంది.

గత ఖరీఫ్ సీజన్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రభుత్వం కేవలం 9 రోజుల్లోనే రూ.29 వేల కోట్లకు పైగా రైతుల ఖాతాలకు బదిలీ చేసి రికార్డు సృష్టించింది. ఇప్పుడు శాటిలైట్ మ్యాపింగ్ ద్వారా వాణిజ్య భూములను తొలగించడంతో రూ.2 వేల కోట్ల వరకు ఆదా అవుతుంది. ఈ మార్పుతో నిజమైన రైతులకు మాత్రమే సాయం అందేలా ప్రభుత్వం కృషి చేస్తోంది. సంక్రాంతి నాటికి అన్నదాతలకు ఈ ఆర్థిక సహాయం అందే అవకాశం ఉంది.

RELATED ARTICLES

Most Popular